హైదరాబాద్, వెలుగు: సీఐడీ ఆఫీసర్నని చెప్పుకుంటూ ఇద్దరు క్యాబ్ డ్రైవర్లను మోసం చేసిన వ్యక్తిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్ఆర్ నగర్, రాయదుర్గం పీఎస్లలో నమోదైన కేసుల్లో రిమాండ్కు తరలించారు. మణికొండ షేక్పేట్ వెస్ట్రన్ ప్లాజాకు చెందిన గరికపాటి శ్రీనివాసులు(46) భువనేశ్వర్లోని సీటీటీసీలో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాడు. గత నెల 29నసిటీలో ఉబర్ క్యాబ్ను బుక్ చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్ భాను నాయక్తో తాను సీఐడీ ఆఫీసర్నని పరిచయం చేసుకున్నాడు. బెంగళూర్, మైసూర్లో ముఖ్యమైన కేసులను దర్యాప్తు చేయాలని చెప్పాడు. ఇలా 4 రోజుల పాటు భాను నాయక్తో పాటు క్యాబ్లో వెళ్లి ఈ నెల 2న తిరిగి హైదరాబాద్ వచ్చాడు.
4 రోజుల ట్రిప్కు రూ.51 వేల క్యాబ్ చార్జి కావడంతో .. ఆ డబ్బులు డిపార్ట్మెంట్ చెల్లిస్తుందని చెప్పి పారిపోయాడు. దీంతో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. గత గురువారం కూడా మరో క్యాబ్ డ్రైవర్ను శ్రీనివాసులు ఇలాగే మోసం చేశాడు. ఉబర్లో తెల్లాపూర్కు చెందిన డ్రైవర్ సురేష్ క్యాబ్ను బుక్ చేసుకున్నాడు. సురేష్తోనూ తాను సీఐడీ ఆఫీసర్నని చెప్పుకున్నాడు. వివిధ కేసుల్లో సీక్రెట్గా తిరగాలని చెప్పాడు. బేగంపేట్లోని గ్రీన్పార్క్ హోటల్ సహా సిటీలోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు. బాధితుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సిటీ నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా శ్రీనివాసులును పట్టుకున్నారు.