వెంటనే హనుమాన్‌ ప్రదర్శించండి.. థియేటర్స్పై నిర్మాతల మండలి ఆగ్రహం

వెంటనే హనుమాన్‌ ప్రదర్శించండి.. థియేటర్స్పై నిర్మాతల మండలి ఆగ్రహం

హనుమాన్‌(HanuMan) సినిమా విషయంలో థియేటర్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి నైజాంలో కొన్ని థియేటర్లలో హనుమాన్ సినిమాను ప్రదర్శించాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు మేకర్స్. కానీ, ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టిసి వేరే సినిమాను ప్రదర్శించారు. ఈ విషయంపై హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్‌ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించారు. 

విషయం తెలుసుకున్న టీఎఫ్‌పీసీ ఆ థియేటర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల తెలుగు సినీ పరిశ్రమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ విషయం గురించి మండలి మాట్లాడుతూ.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం  నైజంలోని కొన్ని థియేటర్స్ లో జనవరి 12 నుంచి హనుమాన్‌ను సినిమా ప్రదర్శించాలి. కానీ, ఆ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. ప్రదర్శించలేదు. ఇలాంటి చర్యల వల్ల చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అపార నష్టం కలుగుతుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒప్పందంలో ఉన్న ఉన్న థియేటర్లలో వెంటనే హనుమాన్‌ ప్రదర్శించాలి. అంతేకాదు.. ఇప్పటివరకూ జరిగిన నష్టాన్ని కూడా వాళ్లే భరించాలి.. అంటూ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేసింది తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో.. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. రోజురోజుకి పెరుగుతున్న జనాలతో.. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది హనుమాన్ మూవీ. రానున్న రోజుల్లో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.