గాన కోకిల మూగబోయింది. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. లతా మంగేష్కర్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. భారతరత్న లతా మంగేషర్కర్ యొక్క విజయాలు సాటిలేనివిగా మిగిలిపోతాయని చెప్పారు.లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆమె మరణం తీరని లోటు అన్నారు. సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన సేవలు మాటల్లో చెప్పడం సాధ్యం కాదన్నారు. లతా మంగేష్కర్ మధురమైన స్వరం మూగబోయిందనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ట్వీట్ చేశారు అమిత్ షా. అలాగే పలువురు ప్రముఖులు, సినీ, సంగీత కళాకారులు సంతాపం తెలిపారు.
Home Minister Amit Shah offers condolences after the passing away of singing legend Lata Mangeshkar
— ANI (@ANI) February 6, 2022
"It is not possible to put into words her contribution to the music world. Her death is a personal loss for me," he tweets pic.twitter.com/mQ6upjj86m
మరిన్ని వార్తల కోసం