పాన్​షాపులో గంజాయి చాక్లెట్స్ విక్రయం

పాన్​షాపులో గంజాయి చాక్లెట్స్ విక్రయం
  • నిర్వాహకుడు అరెస్ట్.. 800 చాక్లెట్లు స్వాధీనం

హైదరాబాద్‌‌, వెలుగు : పాన్​షాపులో గంజాయి చాక్లెట్స్‌‌ విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతని నుంచి 800 గంజాయి చాక్లెట్లు, బైక్‌‌ స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్ పరిధి మల్లాపూర్‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌ మజీద్‌‌(33) స్థానికంగా పాన్‌‌ షాప్‌‌ నిర్వహిస్తున్నాడు. యూపీకి చెందిన రాజన్‌‌ సింగ్‌‌ వద్ద రూ.8 వేలకు 4 కిలోల గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేశాడు.

కొరియర్ ద్వారా హైదరాబాద్​కు తెప్పించుకున్నాడు. వాటిని మజీద్​ఇండస్ట్రియల్‌‌ ఏరియాలో అమ్ముతున్నాడు. అలాగే తన షాపులో ఒక్కోటి రూ.40 చొప్పున విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సౌత్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు మజీద్​పై నిఘా పెట్టారు. శనివారం కంచన్‌‌బాగ్ పీఎస్​పరిధిలోని హఫీజ్‌‌బాబానగర్‌‌‌‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు.