
ది బరీడ్ ట్రూత్ (The Buried Truth) వెబ్ సిరీస్ విడుదలను ఆపాలంటూ సీబీఐ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తెలిసిందే.ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్ లో ఫిబ్రవరి 23 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని..ఈ సిరీస్ ను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టుకెక్కింది సీబీఐ. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయితే ఇన్వెస్టిగేషన్ పై ప్రభావితం అవుతుందని ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టులో సీబీఐ కేసు వేసింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ది బరీడ్ మేకర్స్..సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం ఈ సిరీస్ స్ట్రీమింగ్ను ఆపాలని ఆదేశించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. దీంతో ఈ సిరీస్ స్ట్రీమింగ్కు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే, ఆ సిరీస్ బ్రాడ్కాస్ట్ను ఆపే స్వభావిక అధికారం కోర్టుకు లేదని సీబీఐ స్పెషల్ జడ్జి ఎస్పీ నాయక్ నింబల్కర్ తెలిపారు. అయితే సిరీస్ బ్రాడ్కాస్ట్కు సంబంధిత ఫోరమ్ను సంప్రదించాలని ఆయన సీబీఐకు సూచించారు. దీంతో ది బరీడ్ ట్రూత్ ఫిబ్రవరి 23 నుండి ఈ సిరీస్ నెట్ఫ్లిక్లో స్ట్రీమింగ్కు క్లియర్ అయింది.
సీబీఐ కేసు ఎందుకు వేసింది:
కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించగా..ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీపై వస్తున్న సిరీస్ కావడంతో ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది సీబీఐ.
ది బరీడ్ ట్రూత్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే..
ఈ సిరీస్ లో షీనా బోరా హత్య గురించి వివరించారు. చనిపోయిన షీనా ముఖర్జీ ఇంద్రాణి కుమార్తె. ఆమె 2012లో హఠాత్తుగా అదృశ్యం అయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన పోలీసులు..ఇంద్రాణి, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్ కలిసి షీనాను కారులో గొంతుకోసి హత్య చేశారని తేల్చారు. అయితే ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అందుకే ఈ కేసు విచారణ ముగిసే వరకు ఈ సిరీస్ టెలికాస్ట్ అవకుండా ఆపాలని కోరింది.