
హైదరాబాద్, వెలుగు: సర్కారు వారి పాట సినిమా షో ఉదయం 4 గంటలకే వేసేందుకు 4 థియేటర్లకు రాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కూకట్పల్లిలోని భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో గురువారం ఉదయం 4 గంటలకే షో ప్రదర్శించారు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.