హైదరాబాద్, వెలుగు: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నుంచి అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్ లభించలేదు. ఈ నెల 17న బాండ్ల వేలంతో రూ.2 వేల కోట్లు తీసుకోవాలని రాష్ట్ర సర్కారు భావించినా కేంద్రం నుంచి అనుమతి లేకపోవడంతో ఆర్బీఐ నో చెప్పినట్లు తెలిసింది. ఇటీవల అప్పుల విషయమై కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులే కాకుండా.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గ్యారంటీల మీద చేస్తున్న అప్పులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిని రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని.. ఎఫ్ఆర్బీఎం పరిధిలో గుర్తిస్తామని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర అధికారులు నిరసన వ్యక్తం చేశారు. అప్పులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని మొరపెట్టుకున్నారు. అయితే రాష్ట్ర సర్కార్ ఇచ్చిన వివరాలు సరిగ్గా లేకపోవడంతోనే కేంద్రం నుంచి అప్పులకు పర్మిషన్ రావడం లేదని తెలుస్తున్నది. ఈ నెలలో రూ.8 వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఇంతవరకూ ఒక్క వేలంలో పాల్గొనేందుకు ఆర్బీఐ ఓకే చెప్పలేదు. గడిచిన నెలలోనూ రూ.3 వేల కోట్లు తీసుకోవాల్సి ఉండగా అనుమతి రాలేదు. దీంతో రాష్ట్ర ఖజానాకు కటకట మొదలైందని అధికారులు అంటున్నారు.
అప్పుకు అనుమతివ్వని కేంద్రం
- హైదరాబాద్
- May 14, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సింగరేణిలో బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కు లేదు: వివేక్ వెంకటస్వామి
- మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్రెడ్డి
- బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి?.. అక్రమాల్లో ఆ రెండు పార్టీలూ ఒక్కటే: అమిత్ షా
- మీ కాల్మొక్తా గేటు తీయుండ్రి ! నామినేషన్ టైం అయిపోయాక వచ్చిన అభ్యర్థి
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్
- కాంగ్రెస్కు మహిళల ‘గ్యారంటీ’!
- మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
- హామీలు ఇచ్చేటప్పుడు జర చూసుకొని ఇవ్వాలి సార్..!!
- ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్త.. నా గుండె చీలిస్తే తెలంగాణ కన్పిస్తది: కేసీఆర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!