
హైదరాబాద్, వెలుగు: సమాజానికి మేలు చేసే టెక్నాలజీలు, ప్రొడక్టులను తయారు చేసే స్టార్టప్లను ఎంకరేజ్ చేయడానికి ఒప్పో మొదలుపెట్టిన ఒప్పో ఎలివేట్ ప్రోగ్రామ్ రెండవ ఎడిషన్ హైదరాబాద్లో శుక్రవారం ముగిసింది. డెమో సందర్భంగా, డిజిటల్ హెల్త్లో వినూత్న టెక్నాలజీ సొల్యూషన్స్ కోసం భారతదేశంలోని టాప్–10 టెక్నాలజీ స్టార్టప్లు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించాయి.
ఇందులో గెలిచిన మొదటి నాలుగు విజేతలు ఈ ఏడాది చివరిలో జరిగే ఒప్పో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ప్రపంచస్థాయి ఫైనల్లో తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించడం ద్వారా 46 వేల డాలర్లు గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. ఈ సందర్భంగా ఒప్పో ఇండియా ఆర్&డీ హెడ్ తస్లీమ్ ఆరిఫ్ మాట్లాడుతూ తాము దేశంలోని స్టార్టప్ల విజయానికి ఊతమివ్వాలని స్టార్టప్ల ఎకోసిస్టమ్కు విలువను చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఒప్పో ఎలివేట్ ప్రోగ్రాం ద్వారా, ఒప్పో అద్భుతమైన టెక్ స్టార్టప్లకు సాయం చేస్తూనే ఉంటుందని చెప్పారు.