ఎస్సీలు, ఎస్టీలకు నేను చేసినట్లు ఎవరూ ఏమీ చేయలేదని.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు అధినేత చంద్రబాబు. ఎస్సీ కార్పొ రేషన్ నిధులను వైసీపీ పక్కదారి పట్టించి దళితులనుమోసం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీరం చేసిందని విమర్శించారు. ఎస్పీలకు టీడీపీ చేసిన మంచి పనులు ఎవరూ చేయలేదన్నారు. ఎస్పీ విద్యార్థులు ఉచింతంగా చదువుకొనేందుకు ప్రత్యేక గురుకులాలను టీడీపీ హయాంలో ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. వాస్తవాలకు దూరంగా ఉండే పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని చంద్రబాబు అన్నారు.
జగన్ ఎస్సీ నిధులు దుర్వినియోగం: చంద్రబాబు
దళిత ఉద్ధరణకు పాటుపడతానని మాటిచ్చి ఎన్నికల్లో దళిత ఓట్లతో గద్దెనెక్కిన జగన్రెడ్డి వారి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించడమేంటని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీపై సూక్ష్మసేద్యం ఇచ్చిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ రాయితీలకు మంగళం పాడిందన్నారు. ఎస్సీకార్పొరేషన్ సొమ్ములను తక్షణమే జమచేయకపోతే దళితులు జగన్రెడ్డికి రానున్నఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.