రాష్ట్ర ఆరోగ్యశాఖకు మరిన్ని నిధులు విడుదల

రాష్ట్ర ఆరోగ్యశాఖకు మరిన్ని నిధులు విడుదల

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం, ఆక్సిజన్ కొరత, బెడ్ల సమస్య, వెంటిలేటర్ల కొరత వీటన్నింటిని ద‌ృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖకు నిధులను విడుదల చేసింది. నిధుల విడుదలకు సంబంధించి పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.
 
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ 796.96 కోట్లు, ప్రజారోగ్య శాఖ సంచాలకులు 168.98కోట్లు, వైద్యవిద్యా సంచాలకులు 813.27 కోట్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 2.92కోట్లు, నిమ్స్ 109.75కోట్లు, వైద్యవిధాన పరిషత్ కమిషనర్  297.41 కోట్లు, యోగాధ్యాన పరిషత్ 16.36 కోట్లు, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రి 40.46 కోట్లు, ఆయుర్వేద, యోగ సంచాలకులు 11.80 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.