నిందితుడు చిరంజీవి మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

నిందితుడు చిరంజీవి మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్ : తుకారాంగేట్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చిరంజీవి మృతిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. చిరంజీవి అనుమానాస్పద కస్టోడియల్ మృతిని న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీపీ, నార్త్‌ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్‌హెచ్‌ఓలను చేర్చింది. 

ఇటీవల ఓ చోరీ కేసులో నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీకి చెందిన చిరంజీవిని పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 25న) సాయంత్రం అరెస్ట్‌ చేసి తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ కేసుపై విచారిస్తుండగా నిందితుడు కుప్పకూలాడు. ఆస్పత్రి తరలిస్తుండగా చనిపోయాడు. అయితే.. పోలీసులే కొట్టి చంపారంటూ చిరంజీవి కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రి ఎదుట బుధవారం (ఏప్రిల్ 26న) ఆందోళనకు దిగారు. నిందితుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. దీనిపై వార్తా పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమవ్వడంతో వాటి ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది.