హైదరాబాద్​లో 3 టిమ్స్ టెండర్లు ఖరారు

హైదరాబాద్​లో 3 టిమ్స్ టెండర్లు ఖరారు

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ లో ప్రభుత్వం నిర్మించనున్న మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్(టిమ్స్) టెండర్లు ఖరారయ్యారు. ఎల్ బీ నగర్ హాస్పిటల్ ను ఎల్ అండ్ టీ (రూ.668 కోట్లు) , సనత్ నగర్ హాస్పిటల్ ను మేఘా (రూ.667 కోట్లు), అల్వాల్ హాస్పిటల్ ను డీఈసీ ఇన్ ఫ్రా కంపెనీ (రూ.699 కోట్లు) టెండర్లు దక్కించుకున్నట్లు ఆర్ అండ్ బీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ టెండర్లను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్( సీవోటీ ) ఖరారు చేయగా, ఆ యా కంపెనీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కాపీలను అందచేసినట్లు ఆర్ అండ్ బీ వెల్లడిచింది. ఈ మూడు హాస్పిటల్స్ నిర్మాణానికి నిరుడు ఏప్రిల్ లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ మూడు ప్రాజెక్టులను రూ.2679 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే టెండర్లు దక్కించుకున్న కోట్ అమౌంట్ కేవలం హాస్పిటల్ నిర్మాణ వ్యయం మాత్రమే అని అధికారులు చెబుతున్నారు.