పోలీసుల కళ్లుగప్పి పరారైన దొంగ

పోలీసుల కళ్లుగప్పి పరారైన దొంగ

నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసుల కళ్లుగప్పి కస్టడీ నుండి పరారయ్యాడో దొంగ. సూర్యాపేటకు చెందిన మణికంఠ అనే బైక్ దొంగని గత నెల 30 వ తేదీన అరెస్ట్ చేసి రిమండ్ కు తరలించారు.

ఈనెల 7 న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా ఇవాళ ఉదయం పోలీసుల కళ్లుగప్పి జంప్ అయ్యాడు. 7 బైక్ లు ఒక కారు దొంగతనం కేసులో నిందితుడుగా ఉన్నాడు.  దొంగ కోసం వెదుకుతున్నారు పోలీసులు.