జమ్మూకశ్మీర్ లో ఎదురు కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్ లో  ఎదురు కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగి ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. హలాన్ ఫారెస్ట్ ఏరియాలో టెర్రరిస్టులు దాక్కున్నారన్న సమాచారంతో... భద్రతా బలగాలు జేకే పోలీసులతో కలిసి సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. 

సెక్యూరిటీ ఫోర్స్ పై ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో కాల్పులు జరపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు సైనికులను హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ అమరులయ్యారు. అటు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపు మరింత ముమ్మరం చేశాయి.