ఆ తలనీలాలతో మాకెలాంటి సంబంధం లేదు

ఆ తలనీలాలతో మాకెలాంటి సంబంధం లేదు

మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలు (వెంట్రుకలతో) తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ- ప్లాట్ ఫామ్ ద్వారా అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని చెప్పింది. టెండర్ లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జీఎస్టీ కట్టించుకుని తలనీలాలు అప్పగించడం జరుగుతుందని తెలిపింది. కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా ? లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదని..దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతాయని చెప్పింది. అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుందని.. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని తెలిపింది.  సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పింది.