కృష్ణా గోదావరి నదులపై నిర్మిస్తోన్న ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాలని.. తెలంగాణ, ఏపీ సీఎంలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ట్రాలు ఇప్పటివరకు డీపీఆర్ లు ఇవ్వలేదన్నారు. అన్ని ప్రాజెక్టుల డీపీఆర్లు ఇస్తామని తెలంగాణ , ఏపీ సీఎంలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పారని గుర్తు చేశారు గజేంద్ర సింగ్ షెకావత్. తెలంగాణ.. కృష్ణానదిపై నిర్మిస్తోన్న 8 ప్రాజెక్టులు, గోదావరిపై నిర్మిస్తోన్న 7 ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏపీ కృష్ణానదిపై నిర్మిస్తున్న సంగమేశ్వరంతో సహా 15 ప్రాజెక్టులు.. గోదావరిపై నిర్మిస్తున్న 4 ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలన్నారు గజేంద్రసింగ్ షెకావత్.
see more news
సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే
భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్
మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని
సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే