మరీ క్రూరంగా ఉన్నారే : పులిని చంపి.. చెట్టుకు ఉరిగా వేలాడదీశారు

మరీ క్రూరంగా ఉన్నారే : పులిని చంపి.. చెట్టుకు ఉరిగా వేలాడదీశారు

ఎంత ధైర్యవంతులైనా చిరుత అంటే ఆమడ దూరం పరిగెత్తాల్సిందే. కానీ, మంగళవారం (ఫిబ్రవరి 13)న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎవరో గుర్తు తెలియని దుండగులు చిరుత పులిని చంపి చెట్టుకు ఊరి వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లా కంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో కనియన్ గ్రామంలో చిరుత చంపి చెట్టుకు వేలాడతీశారు. ఈ విషయాన్ని స్థానికులు అటవి శాఖ అధికారులు, పోలీసులకు చెప్పారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతని అంత క్రూరంగా చంపింది ఎవరని ఆధారాలు సేకరించారు. ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. చిరుతను పోస్ట్ మార్టంకు పంపించారు. విచారణ జరిపి వెంటనే చిరుతని చంపిన వారిని అధికారులు పట్టుకున్నారు. అదే ప్రాంతంలో మరొ చిరుత కూడా సంచరిస్తోందని అధికారులకు సమాచారం అందింది.