భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి

భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి

మోర్తాడ్, వెలుగు: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక అస్వస్థతకు గురైన భార్య ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపురానికి చెందిన మైసయ్య(55) కొద్ది రోజులుగా అనారోగ్యం పాలయ్యారు. పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం సాయంత్రం మైసయ్య చనిపోయాడు. మంగళవారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో భార్య గౌరమ్మ(50) సోయి తప్పి పడిపోయింది. వెంటనే స్థానికుల ఆమెను నిజామాబాద్ హాస్పిటల్​కు 108 అంబులెన్స్ లో తీసుకెళ్లారు.

అప్పటికే గౌరమ్మ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో తిరిగి ఆమె మృతదేహాన్ని తిమ్మాపూర్ కు తీసుకువచ్చారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన మైసయ్య, గౌరమ్మ ఒకే సారి చనిపోవడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది. అందరూ కలిసి చందాలు వేసుకొని దహన సంస్కారాలు నిర్వహించారు.