కోహెడ, వెలుగు: వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని, ప్రియుడితో కలిసి మర్డర్చేసి డెడ్బాడీని పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారం ప్రాంతానికి చెందిన చౌహాన్ప్రఫుల్(29), భార్య జ్యోతి అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో మందలించి వదిలేశాడు. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, భర్తను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రియుడితో ప్లాన్వేసింది. ఇద్దరూ కలిసి చౌహాన్ప్రఫుల్ను మే 6 న హత్యచేసి సిద్దిపేట జిల్లా శనిగరం, తంగళ్లపల్లి శివారులోని గుట్టల్లో పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్త కనబడడం లేదని జ్యోతి బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ప్రియుడు కృష్ణను ఇంటరాగేట్చేయగా అసలు విషయం బయటపెట్టాడు. 3 నెలల తర్వాత కేసును చేధించిన బొల్లారం పోలీసులు శనివారం తంగళ్లపల్లి గుట్టల్లో డెడ్బాడీని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేయించారు. బొల్లారం సీఐ ప్రశాంత్, ఎస్సై రామ్నాథ్, కోహెడ తహసీల్దార్రుక్మిణీ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్లు పోస్టుమార్టం
నిర్వహించారు.