సదాశివపేట ఎస్బీఐ ఏటీఎంలలో చోరీ

సదాశివపేట ఎస్బీఐ ఏటీఎంలలో చోరీ
  • మూడు చోట్ల గ్యాస్ ​కట్టర్లతో కట్ ​చేసి దోపిడీ
  • సీసీ కెమెరాలపై వైట్ ​పెయింట్​ స్ప్రే
  • ఎంత క్యాష్​ పోయిందో చెప్పని పోలీసులు

సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దొంగలు ఏటీఎంలను టార్గెట్​ చేశారు. ఒకే రోజు మూడు ఎస్బీఐ  ఏటీఎంలను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకు వెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కెమెరాలకు వైట్ ​పెయింట్​స్ప్రే చేసి మరీ నగదు దొంగిలించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పట్టణంలోని బసవేశ్వర మందిరం, గాంధీ చౌక్, గర్ల్స్ ​హైస్కూల్​వద్ద ఉన్న ఏటీఎంలను గ్యాస్​కట్టర్​లతో ఓపెన్​ చేశారు. తర్వాత అందులోని డబ్బునంతా ఎత్తుకెళ్లారు. ఎంత నగదు పోయిందన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సీఐ నవీన్​కుమార్, డీఎస్పీ రవీందర్​రెడ్డికి కాల్​ చేయగా స్పందించలేదు.

సదాశివపేటలో వరస దొంగతనాలు

సదాశివపేటలో వరుస దొంగతనాలు జరుగుతు న్నాయి. ఇంటి ముందు బైకులతో పాటు   ఆదివారం, బుధవారం సంతల్లో దొంగలు సెల్​ఫోన్లు మాయం చేస్తున్నారు. బస్టాండ్​లో బస్సెక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు సెల్​ఫోన్లు కొట్టేస్తున్నారు. రికవరీ కోసం పీఎస్​లకు వెళ్లినా ప్రయోజనం ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు.