ఈసీఐఎల్ బజాజ్ షోరూంలో భారీ చోరీ

ఈసీఐఎల్ బజాజ్ షోరూంలో భారీ చోరీ

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో కోట్ల విలువైన ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. లక్షల విలువైన 350 సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ దొంగతనానికి గురయ్యాయి. వాటి విలువ దాదాపు 3 కోట్లు ఉంటుందని అంచనా.

షో రూమ్ లో దొంగతం జరిగినట్లు గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మి పెరుమాల్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.