నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ మెయిన్ రోడ్డులో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం ఉదయం… అమ్మవారికి పూజలు చేసేందుకు అర్చకులు రాగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు ఆలయంలో గర్భగుడి తాళం పగలకొట్టి .. అమ్మవారి విగ్రహం పై ఉన్న 12 కేజీల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు, 10 వేల నగదును అపహరించారు. దేవాలయ పూజారుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా దేవాలయంలోని సీసీ కెమెరాల పుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
For More News..