పదిన్నర తులాల గోల్డ్, 36 తులాల వెండి స్వాధీనం
మేడిపల్లి, వెలుగు :ఎంజాయ్ చేసేందుకు చోరీలు చేస్తున్న బావ బావమరిదిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద పదిన్నర తులాల బంగారం, 39 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షితమూర్తి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. మల్లాపూర్లో ఉండే జంగలం చందన్ అలియాస్ రమేష్ ( 36 ), సిరిగిరి శంకరయ్య అలియాస్ శంకర్ ( 26 ) బావ బావమరుదులు. గతంలో చందన్ చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం డ్రైవర్గా పని చేస్తున్నాడు. శాలరీ సరిపోకపోవడంతో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్వేశాడు. తన బావమరిది శంకర్తో కలిసి తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేస్తున్నారు. మేడిపల్లి హనుమాన్ కమాన్ వద్ద పోలీసులు చెకింగ్చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని కేసులు ఫైల్ చేశారు. మేడిపల్లి పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.
ఇద్దరు దొంగల అరెస్ట్
దుండిగల్ : బైక్దొంగలను దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాలానగర్ జోన్ ఏసీపీ రామలింగరాజు సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. సూరారం కాలనీలో ఉండే శంకర్ యాదవ్ (29), రామయ్యగారి మహేష్ గౌడ్ (30)లు చెడు వ్యసనాలకు బానిసలై బైక్లు, ఆటోలు చోరీ చేసి అమ్ముతున్నారు. దుండిగల్, బాచుపల్లి, సూరారం తదితర ఏరియాల్లోని హోటల్స్, థియేటర్స్, అపార్ట్మెంట్లలో బైక్లను ఎత్తుకెళ్లారు. సోమవారం బహదూర్ పల్లి చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించగా ఎస్ఐ వెంకటరెడ్డి అదుపులోకి తీసుకుని విచారించారు. 4 బైక్లు, ఆటోను చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద బైక్, ఆటోను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసులో చొరవ చూపిన పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.