సంగారెడ్డిలో 3, మెదక్​లో 4 నామినేషన్లు

సంగారెడ్డిలో 3, మెదక్​లో 4 నామినేషన్లు

సంగారెడ్డి, వెలుగు : జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బి.మారుతీ రావు, కె.ఆనందీశ్వర్ ఒక్కొక్క సెట్ నామినేషన్ పత్రాలు అందజేయగా, మహాదేవ్ స్వామి (2) సెట్లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రెండు రోజుల్లో మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.

మెదక్ లోక్​ సభ స్థానానికి 4 నామినేషన్లు 

మెదక్​:  మెదక్ లోక్​ సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ​ప్రజావెలుగు పార్టీ నుంచి సారాయాదగిరి గౌడ్,  పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గొల్లపల్లి సాయి గౌడ్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బొమ్మల విజయ్ కుమార్ , తుమ్మలపల్లి పృథ్వీరాజ్ నామినేషన్ వేశారని రిటర్నింగ్ ఆఫీసర్​ రాహుల్​ రాజ్ తెలిపారు.  రెండు రోజుల్లో మొత్తం ఎనమిది నామినేషన్లు దాఖలయ్యాయి.