తెలంగాణ నుంచి .. అయోధ్యకు దారి ఇదే

తెలంగాణ నుంచి .. అయోధ్యకు దారి ఇదే

శంషాబాద్​ నుంచి అయోధ్యకు నేరుగా​ విమాన సర్వీసులు ఉన్నాయి. కానీ, అవి ఎక్కువ సంఖ్యలో లేవు. గోరఖ్​ పూర్, లక్నో ఎయిర్​పోర్ట్​కు వెళ్తారు. అక్కడి నుంచి దాదాపు140 కిలో మీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు నాలుగ్గంటల ప్రయాణం బస్సు లేదా ట్రైన్లలో వెళ్లాలి. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఉంది. తెలంగాణ నుంచి డైరెక్ట్ రైళ్లు అయోధ్యకు లేవు. ట్రైన్​లో వెళ్లాలనుకుంటే... సికింద్రాబాద్​ నుంచి గోరఖ్​పూర్ వెళ్లాలి. 

అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో వెళ్లాలి. ప్రతి శుక్రవారం ఉదయం10 :50కి ట్రైన్ బయల్దేరుతుంది. 30 గంటలపాటు ప్రయాణం. దీంతోపాటు సికింద్రాబాద్ నుంచి బీదర్ – అయోధ్య వీక్లి ఎక్స్​ప్రెస్‌ ఆది, సోమ వారాల్లో ఉంది. తెలంగాణ నుంచి అయోధ్యకు ట్రైన్​లో వెళ్లాలనుకుంటే ఆది, సోమ, శుక్ర వారాల్లో వెళ్లొచ్చు.