మంత్రుల పర్యటన.. టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు

మంత్రుల పర్యటన.. టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు

మంత్రుల ముందే మహబూబాబాద్ టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. నిర్మాణ పనులను మంత్రులకు  వివరించే క్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరుతో వివాదం తలెత్తింది. 

చాలా వరకు పార్టీ కార్యాలయ పనులను సంబంధిత కాంట్రాక్టర్ తో సంబంధం లేకుండా తానే సొంతంగా చేపట్టానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాటల మధ్యలో చెప్పారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న ఎంపీ కవిత... పార్టీ కార్యాలయ నిర్మాణ ఖర్చులను పార్టీ భరిస్తుందని, మీరు చేసింది ఏమీ లేదని మంత్రులకు చెప్పారు. దీంతో అక్కడున్న మంత్రుల ముందే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అనంతరం మంత్రులు వారిద్దరికీ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.