హైదరాబాద్, వెలుగు: పామాయిల్ వల్ల కలిగే లాభాలపై అవగాహన కలిగించేందుకు మలేషియా పామాయిల్ కౌన్సిల్ (ఎంపీఓసీ) హైదరాబాద్లో వర్క్షాప్ ఏర్పాటు చేసింది. హెల్త్, న్యూట్రిషన్ ఎక్స్పర్టులూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇండస్ట్రియలిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేతన్ మెహతా మాట్లాడుతూ ఇతర నూనెలతో పోలిస్తే పామాయిల్లో పోషకాలు ఎక్కువన్నారు.