నైజీరియాలో గ్రామంపై కాల్పులు.. 50 మంది మృతి

నైజీరియాలో గ్రామంపై కాల్పులు.. 50 మంది మృతి

రైతులకు, పశువుల కాపరులకు గొడవలే హింసకు కారణం? 

అబూజ (నైజీరియా) : సెంట్రల్ నైజీరియాలో భూముల విషయంలో రైతులకు, పశువుల కాపరులకు మధ్య గొడవలు దారుణమైన హింసకు దారితీశాయి. బెన్యూ స్టేట్​లోని ఉమోగిడి గ్రామంలోకి తుపాకులతో చొరబడిన కొందరు దుండగులు గ్రామస్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 50 మంది మృత్యువాతపడ్డారు. స్థానిక రైతులకు, పశువుల కాపరులకు మధ్య ఉన్న గొడవలే ఈ హింసకు దారి తీసి ఉంటాయని భావిస్తున్నారు. ముందుగా మంగళవారం ముగ్గురు గ్రామస్తులను దుండగులు కాల్చి చంపారు. బుధవారం ఆ ముగ్గురికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం గ్రామస్తులు గుమిగూడిన సమయంలో మరికొందరు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు.