రాత్రివేళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్

రాత్రివేళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్

మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి ఇవాళ రెడ్ అలర్ట్..రేపు ఆరేంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. రాత్రివేళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధానంగా ఉత్తర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.  

48 గంటల తర్వాత వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని..24గంటల్లో అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. దీన్ని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. అల్పపీడనం ఎఫెక్ట్ తో ఇవాళ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 30 నుండి 40కి.మీ వేగంతో  ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.