
- సింగరేణి ల్యాండ్ లో కార్పొరేషన్ నిర్మాణాలు
- మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా పనులు
- పర్మిషన్లు లేవని అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ
- రెండు శాఖల మధ్య సమన్వయ లోపం
- రోడ్డున పడ్డ కూరగాయల వ్యాపారులు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మధ్య నెలకొన్న భూ వివాదం ఉద్రిక్తంగా మారుతోంది. సింగరేణి భూముల్లో కార్పొరేషన్మార్కెట్నిర్మాణ పనులు చేపట్టగా సంస్థ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తమ భూముల్లో ఎలా నిర్మాణాలు చేపడతారని మున్సిపల్ ఆఫీసర్లను సింగరేణి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అక్కడ ఉన్న చిరు వ్యాపారులను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఇరు శాఖల మధ్య సమన్వయ లోపం, వివాదం కారణంగా చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు.
అప్పట్లో భూమిని ఇస్తామంటే..
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం సిటీ మధ్యలో కూలీ లైన్– ఎంజీ రోడ్లో సింగరేణికి 10 ఎకరాలకుపైగా ల్యాండ్ఉంది. ఇక్కడే రైతు బజార్కూడా ఉండేది. ఈ భూమిని గతంలో ప్రభుత్వానికి సరెండర్చేసేందుకు సింగరేణి ముందుకు వచ్చింది. అయితే.. కోర్టు కేసులు ఉండడంతో తలనొప్పి ఎందుకని మున్సిపల్, రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. కాగా.. ఆ స్థలంలో చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటున్నారు. గత సర్కార్ హయాంలో పబ్లిక్హెల్త్డిపార్ట్మెంట్రూ.4.50 కోట్లతో ఆ భూమిలో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే ఇంటిగ్రేటెడ్మార్కెట్నిర్మాణాలు చేపట్టగా.. సింగరేణి పెద్దగా పట్టించుకోలేదు.
అదేవిధంగా మార్కెట్ పనులకు ఫండ్స్సరిగా రాకపోవడంతో మూడేండ్లుగా నిలిచిపోయాయి. అదే స్థలంలో ఇంకో చోట రెండేండ్ల కింద మరో రూ. కోటి నిధులతో మున్సిపల్ అధికారులు మార్కెట్నిర్మాణం చేపట్టారు. దీంతో సింగరేణి ఆఫీసర్లు అడ్డుకోవడంతో వివాదం నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడినా సమసిపోలేదు. ఇటీవల రూ. 50లక్షలతో కొత్తగా మరో చోట మార్కెట్షెడ్స్నిర్మాణాలకు ప్రస్తుత ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. షెడ్స్ నిర్మాణాలకు టెండర్పొందిన కాంట్రాక్టర్వారం రోజుల కింద పనులు చేపట్టాడు. సింగరేణి ఎస్టేట్, సర్వే, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పనులను నిలిపివేశారు.
అనంతరం మళ్లీ రెండు మూడు రోజులుగా కాంట్రాక్టర్పనులు కొనసాగిస్తుండగా సింగరేణి అధికారులు మళ్లీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి యాజమాన్యం నుంచి పర్మిషన్స్తెచ్చుకున్న తర్వాతనే పనులు చేపట్టాలని తేల్చి చెప్పారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా కాపలాగా పెట్టారు. గతంలోనూ అదే ల్యాండ్లో ప్యూరి ఫైడ్వాటర్డ్రింకింగ్ప్లాంట్కట్టేందుకు మున్సిపల్అధికారులు యత్నించారు. సగం పనులు చేపట్టిన తర్వాత సింగరేణి అధికారులకు స్థానికులు కొందరు ఫిర్యాదులు చేయడంతో పనులను ఆపేశారు. ఇలా కొన్నాళ్లుగా రెండు శాఖల మధ్య భూ వివాదం నెలకొంది.
సింగరేణి ఫండ్స్ తోనే నిర్మాణాలు
మున్సిపల్ అధికారులు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్నిర్మాణాలకు సింగరేణినే డీఎంఎఫ్ ఫండ్స్ కేటాయించింది. ఇదిలా ఉండగా.. నిర్మాణ పనులను సింగరేణి అడ్డుకుంటుందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ పర్మిషన్స్లేకుండా అక్రమంగా నిర్మాణాలు ఎలా చేస్తారంటూ సింగరేణి ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా.. మూడు వారాల కింద కార్పొరేషన్ కమిషనర్సుజాత అక్కడికి వెళ్లి కూరగాయాలు అమ్ముకునే వ్యాపారులను ఖాళీ చేయించారు.
షాపింగ్ కాంప్లెక్స్, మల్టీ ప్లెక్స్
సింగరేణికి చెందిన శిథిలావస్థలో ఉన్న షాపుల స్థానంలో కొత్తవి నిర్మించాలంటూ ఎమ్మెల్యే సాంబశివరావు గతంలో సీఎండీ ఎన్. బలరామ్ను కోరారు. దీంతో జీ ప్లస్ టూ లో షాపింగ్కాంప్లెక్స్నిర్మాణాలకు ప్లాన్చేశారు. ఇప్పటికే లే అవుట్కూడా పూర్తి చేశారు. మరోవైపు భారీ ఎత్తున మల్టీప్లెక్స్నిర్మాణాలకు సింగరేణి ప్లాన్ చేస్తోంది.
స్థలానికి పర్మిషన్లు చూపకుంటే చర్యలు
సింగరేణి కార్పొరేట్ ఆఫీసుకు చెందిన స్థలంలోని రైతు బజార్లో అనుమతులు లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణాలు చేపట్టింది. ఈ స్థలం సింగరేణిది అని బోర్డు పెట్టేందుకు వెళ్లగా ఎమ్మెల్యేతో మాట్లాడుతామని, రెండు రోజులు సమయం ఇవ్వమని స్థానిక వ్యాపారులు, యూనియన్నేతలు కోరారు. రెండు రోజుల్లో సంబంధిత పత్రాలు తీసుకురాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
- లక్ష్మీనారాయణ, జీఎం సెక్యూరిటీ, సింగరేణి
చర్చించి నిర్ణయం తీసుకుంటాం..
సింగరేణి జాగాలోని రైతు బజార్లో నిర్మిస్తున్న మార్కెట్లకు స్థలాన్ని ఇవ్వలేమని సంస్థ అధికారులు చెబుతున్నారు. గతంలోనే పర్మిషన్స్లేకుండా మున్సిపల్నిర్మాణాలు చేపట్టారు. అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే, ఉన్నతాధికారులతో చర్చించిన ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు పనులను ఆపాలంటూ కాంట్రాక్టర్చెప్పాం.
- సుజాత, కమిషనర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్