ఉద్యోగుల విభజన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో క్లారిటీ లేదు

ఉద్యోగుల విభజన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో క్లారిటీ లేదు
  • తెలంగాణ ఉద్యోగుల సంఘం

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సర్దుబాటుపై ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో స్పష్టత లేదని, ఉద్యోగుల్లో గందరగోళం ఉందని తెలంగాణ ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విషయంలో జోనల్ విధానాన్ని కొనసాగించాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీంద్రకుమార్, హరీశ్‌‌‌‌ కుమార్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చినపుడు వారి సొంత జిల్లా, జోనల్‌‌‌‌లోకే వారిని కేటాయించాలన్నారు. గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో డౌట్లు  క్లారిఫై చేయడానికి ప్రభుత్వం హెల్ప్‌‌‌‌లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.