నీళ్లు అనుకొని యాసిడ్ తాగారు

నీళ్లు అనుకొని యాసిడ్ తాగారు

షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్లు.. నీళ్లు అనుకొని యాసిడ్ తాగారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ సుల్తాన్ షాపింగ్ మాల్ లో జరిగింది. ఈ నెల 29న పెళ్లిరోజు ఉండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ చెందిన విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చింది. దాహంగా ఉందని నీళ్లు అడిగితే.. ఓ వర్కర్ నీళ్లు అనుకొని యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. కస్టమర్ తో పాటు షాపింగ్ మాల్ వర్కర్ కూడా దాన్ని తాగారు. ఆ తర్వాత .. రుచి ఆధారంగా తాము తాగింది యాసిడ్ అని వారు గుర్తించారు. దీంతో వారిద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్లారు.