చెరువు మధ్యలో దొంగ.. బయటకు రావలంటున్న పోలీసులు

చెరువు మధ్యలో దొంగ.. బయటకు రావలంటున్న  పోలీసులు

పై ఫోటోలో చెరువులో చక్కగా కూర్చున్నాడు కదా.. ఇతనో దొంగ..  ఎప్పటిలాగే ఓ ఇంటికి  దొంగతనానికి వెళ్లాడు.  కానీ ఎప్పుడు టైమ్ ఒకేలా ఉండదు కదా..  ఇల్లు గుల్ల చేసి పారిపోయేలోపు ఇంటి యజమానులు వచ్చేశారు. ఇంకేముంది తప్పించుకోవడమే తరువాయి అనుకోని అక్కడినుండి పారిపోయాడు. అతన్ని కొంతమంది వెంబడించారు.  

దీంతో వాళ్ల నుంచి తప్పించుకుందామని చెరువులోకి దూకేశాడు. అందులో నుంచి ఈత కొట్టుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఓ రాయి మీద చక్కగా గౌతమ బుద్దిడి లాగా కూర్చున్నాడు.  ఈ ఘటన  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  

కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు   దొంగని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.   పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆ దొంగ బయటికి రాకుండా చెరువు మధ్యలో కూర్చున్నాడు. అకలి అవుతున్న, చీకటి పడుతున్న  లెక్కచేయకుండా అదే రాయిపై అలాగే  కూర్చున్నాడు.  పోలీసులు అతన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  చెరువు మధ్యలో కూర్చున్న దొంగను చూసేందుకు స్థానికులు భారీగా గుమికూడారు.