అమ్మవారికి మొక్కి.. ఆలయంలో హుండీ చోరీ

అమ్మవారికి మొక్కి.. ఆలయంలో హుండీ చోరీ

దొంగతనంలోనూ.. దొంగ భక్తిని చూపించాడో కేటుగాడు. గుడిలో అమ్మ ఆశీర్వాదం తీసుకొని.. అమ్మవారి హుండీకే టోపీ పెట్టాడు. ఓ వైపు దొంగతనం చేయాలని ఉన్నా.. ఏదో మూలన పాపభీతి వెంటాడిందో ఏమో.. ఆలయంలో అమ్మవారికి దండం పెట్టి ఆ తర్వాత విగ్రహం పక్కనే ఉన్న హుండీ చోరీకి పాల్పడ్డాడు. అందినకాడిక తీసి రెండు జేబుల్లో అమ్మవారి కానుకలను నింపుకున్నాడు.

ఈ దొంగతనం.. ఖమ్మం నాలుగో డివిజన్ లోని అంకమ్మ ఆలయంలో జరిగింది. ఆలయ తలుపు తాళం పగలగొట్టి.. హుండీ తాళాల వెతికి మరీ దొరకబట్టి సొమ్మును కాజేశాడు దొంగ. ఈ దొంగతనం సీన్ అంతా ప్రేమ్ టు ప్రేమ్ రికార్డు అయింది. దొంగ అమ్మవారికి దండం పెట్టి చోరీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని వార్తల కోసం..

శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

వింగ్ కమాండర్ అభినందన్‌కు ప్రమోషన్

క్రాకర్స్ కాలుస్తున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి