గ్రూప్ కెప్టెన్ గా పైలట్ అభినందన్

గ్రూప్ కెప్టెన్ గా పైలట్ అభినందన్

భారత వాయుసేన పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‎కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‎గా నియమిస్తూ భారత వాయుసేన ఉత్తర్వులు జారీ చేసింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత..  భారత్, పాక్  మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. ఈ క్రమంలోనే అభినందన్‎కు పదోన్నతి దక్కింది. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడినందుకుగానూ అభినందన్‎ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. తాజాగా అభినందన్‎కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ దక్కనుంది. ఈ పదవి సైనికదళంలో కల్నల్ ర్యాంక్‎తో సమానం.