మేడపై పడుకుంటే ఫోన్లు కొట్టేస్తాడు.. ఈడో రకం దొంగ

మేడపై పడుకుంటే ఫోన్లు కొట్టేస్తాడు.. ఈడో రకం దొంగ

చాలామందికి ఈ చేదు అనుభవం ఎదురై ఉంటుంది. కాంక్రీట్ జంగిల్ లా మారిన హైదరాబాద్ లో అడగడుగునా అపార్టుమెంట్లు వెలిశాయి. అమీర్ పేట్ లాంటి ఏరియాలో అయితే.. అపార్టుమెంట్లన్నీ బాయ్స్, గార్ల్స్ హాస్టల్స్ గా మారిపోయాయి. ఫ్యామిలీస్ ఉంటున్న అపార్టుమెంట్లైనా.. బ్యాచిలర్స్ ఉంటున్న అపార్టుమెంట్లు అయినా.. పైన డాబాపై పడుకోవడం అనేది చాలామందికి అలవాటు. అలా పడుకున్నప్పుడు.. తమ వెంట పర్సులు, ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటుంటారు చాలామంది. ఐతే.. తెల్లారి లేచి చూసేసరికి అవి మాయం అవ్వడం.. ఎవరో కొట్టేశారని గగ్గోలు పెట్టిన సందర్భాలు ఎన్నో చూస్తుంటాం. సరిగ్గా అలాగే ఓ అపార్టుమెంట్ లో జరిగితే.. దొంగను పట్టుకునేందుకు సీసీ కెమెరా పెట్టారు. అలా.. ఆ దొంగ దొరికిపోయాడు. దానికి సంబంధించినదే ఈ వార్త.

హైదరాబాద్ అమీర్ పేట్ పక్కనే ఉన్న ఎల్లారెడ్డిగూడలోని సంజయ్ గాంధీ నగర్లో ఈ సంఘటన జరిగింది. మేడ మీద కొందరు యువకులు నిద్రపోయిన టైమ్ లో.. ఓ దొంగ అర్థరాత్రి టైమ్ లో అక్కడకు వచ్చాడు. చప్పుడు చేయకుండా.. అడుగులో అడుగేస్తూ… పడుకున్న వారి బ్యాక్ పాకెట్ లో ఉన్న పర్సు, కాస్ట్‌లీ ఫోన్లు ఎత్తుకుపోయాడు. హమ్మయ్య ఎవరికీ దొరకలేదు అని ఆ దొంగ అనుకున్నాడు. కానీ.. సీసీ కెమెరాకు దొరికిపోయాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.