తలుపుకు గొళ్లెం పెట్టి గొర్రెలు ఎత్తుకెల్లిన్రు

తలుపుకు గొళ్లెం పెట్టి గొర్రెలు ఎత్తుకెల్లిన్రు

ఉప్పునుంతల, వెలుగు : మండలంలోని రాయిచేడు గ్రామానికి చెందిన జాజాల శ్రీనుకు చెందిన 15 గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాజాల శ్రీను తన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న దొడ్డిలో గొర్రెలను ఉంచుతాడు. శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇంటి తలుపులకు బయటి నుంచి గొళ్లెం పెట్టి, పవర్  కట్  చేసి వెంట తీసుకొచ్చిన బొలెరో వెహికల్​లో గొర్రెలను ఎత్తుకెళ్లారు. కరెంట్​ పోగానే నిద్ర లేచిన శ్రీను భార్య భాగ్యమ్మ తలుపులు తెరవడానికి ప్రయత్నించగా రాలేదు.

కిటికీ నుంచి బయటకు చూసిన ఆమె గొర్రెలను వెహికల్​లో ఎక్కిస్తున్న విషయాన్ని గుర్తించి కేకలు వేయడంతో పక్కనే నిద్రిస్తున్న తండ్రి వచ్చి తలుపు గొళ్లెం తీసేవరకు దుండగులు గొర్రెలతో పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోనేటిపురం టోల్​గేట్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుస్వామి తెలిపారు.