ఎంతో కష్టపడి పండించిన పత్తిపంట పైసలను ఎత్తుకెళ్లిన దొంగలు

ఎంతో కష్టపడి పండించిన పత్తిపంట పైసలను ఎత్తుకెళ్లిన దొంగలు

మంచిర్యాల జిల్లా: ఎంతో కష్టపడి పండించిన పత్తి పంట పైసలను ఓ రైతు దగ్గర దొంగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ సంఘటన మంగళవారం మంచిర్యాల జిల్లాలో జరిగింది. బెల్లంపల్లిలోని బెంగుళూరు బేకరీ వద్ద రైతు మోటార్ సైకిల్ లో ఉన్న రూ.1,50,000/- నగదును ఎత్తుకెళ్లారు. చిన్నబూదే గ్రామానికి చెందిన వంశీకృష్ణ అనే యువరైతు పత్తి అమ్మగా వచ్చిన డబ్బులు ( లక్షా 50 వేలు) బ్యాంకు నుండి తీసుకువస్తున్నాడు.

అయితే మార్గమధ్యలో బెల్లంపల్లిలోని బెంగళూరు బేకరీలో కూల్ డ్రింక్ తాగేందుకు బైక్ దిగాడు. ఈ లోపే దొంగలు చేతివాటం చూపించారు. రైతు కూల్ డ్రింక్ తాగి వచ్చేసరికి బైక్ డిక్కీ తెరిచి ఉండటంతో అనుమానం వచ్చిన బ్యాగ్ చూసే సరికి డబ్బు లేదని లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు వన్ టౌన్ పోలిసులు.