పద్మారావునగర్, వెలుగు: చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సికింద్రాబాద్ అడ్డగుట్ట తిరంగా యూత్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టూవీలర్లకు మాంజా గార్డులను ఉచితంగా అమర్చుతోంది. బైక్ముందు భాగంలో ఇనుప వైర్ ను యూ ఆకారంలో బిగిస్తున్నారు.
ఒక్కో వైర్కు రూ.65 ఖర్చవుతుండగా.. ఇప్పటివరకు 1,000కి పైగా వాహనాలకు ఈ గార్డులను అమర్చినట్లు, సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు అసోసియేషన్ సభ్యుడు నాగరాజు తెలిపారు. యూత్సభ్యులను తుకారం గేట్ ఎస్సై శ్రీనివాస్గౌడ్వారిని అభినందించారు.
