తెలంగాణ గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం

తెలంగాణ గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం

తెలంగాణ యావత్తు గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని సీఎం అభిప్రాయపడ్డారు. మహాకవి దాశరథి పురస్కారం –2020ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్ లో రామానుజంకు అందించి.. శాలువా కప్పి సన్మానించారు. రామానుజంకు జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు. దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని కేసీఆర్ అన్నారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు. రామానుజం మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కార్యదర్శి శ్రీనివాస రాజు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానుజం ఓ పద్యం రాసి, పాడి వివినిపించారు.

‘‘శ్రీ తెలంగాణమును శ్రీ ఖండమును సేయ..
అవతరించిన యట్టి అపర విష్ణుడవు నీవు
తెలగాణమున కోటి ఎకరాలు పారించి..
పంట భూమిగ మార్చ ప్రతిన బూనిన యట్టి రైతు స్వామివి నీవు..
జాతి నేతవు నీవు..  శ్రీ కల్వకుంట్ల క్షీరాబ్ధి చంద్రమా.. శ్రీ రస్తు
శ్రీ చంద్రశేఖరా..  తెలంగాణ దీపమా.. విజయోస్తు’’ అని రామానుజం అప్పటికప్పుడే పాడి వినిపించారు.

For More News..

ప్రగతిభవన్ లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రం ఖాతాలో..

ఢిల్లీలో జాతీయజెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి