ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు: థామస్ రెడ్డి

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు: థామస్ రెడ్డి

ఆర్టీసీ బిల్లుపై  గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు  కార్మికసంఘాల నేత థామస్ రెడ్డి. రాజ్ భవన్ లో గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు. 

అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి  వివరణ  అందలేదని .. వివరణ అందాక  గవర్నర్ ఆమోదిస్తామన్నారని థామస్ రెడ్డి చెప్పారు.   సత్వర పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్ హమీ ఇచ్చినట్లు వెల్లడించారు.  ఆర్టీసీ కార్మికులను న్యాయం జరగాలని గవర్నర్ అన్నారన్నారు.   అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్న నమ్మకం ఉందన్నారు.