మోడీ సర్కార్‌ను విమర్శిస్తే జాతి వ్యతిరేకులు.. ప్రశంసిస్తే జాతీయవాదులా?

మోడీ సర్కార్‌ను విమర్శిస్తే జాతి వ్యతిరేకులు.. ప్రశంసిస్తే జాతీయవాదులా?

ముంబై: మోడీ సర్కార్‌ను విమర్శిస్తే జాతి వ్యతిరేకులనే ముద్ర వేయడం సరికాదని మహారాష్ట్రలోని అధికార శివసేన ఫైర్ అయ్యింది. ‘మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినా, తప్పుబట్టినా జాతి వ్యతిరేకులని అంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తే మాత్రం జాతీయవాదులని అంటున్నారు. ఇదేం చోద్యం’ అంటూ శివసేన తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అది దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో శివసేన పైకామెంట్స్ చేయడం గమనార్హం.