అహంకారానికి.. పేదింటి బిడ్డకు మధ్యే పోటీ :  తోటకూర వజ్రేశ్​ యాదవ్

 అహంకారానికి.. పేదింటి బిడ్డకు మధ్యే పోటీ :  తోటకూర వజ్రేశ్​ యాదవ్

కీసర, వెలుగు: మేడ్చల్ సెగ్మెంట్​లో మంత్రి మల్లారెడ్డి అహంకారానికి.. పేదింటి బిడ్డకు మధ్య పోటీ నెలకొందని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ ​యాదవ్ తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కీసర మండలంలోని వన్నీగూడ, బోగారం, కరీంగూడలో నిర్వహించిన రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నేత నక్క ప్రభాకర్ గౌడ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వజ్రేశ్​ యాదవ్ మాట్లాడుతూ.. బోయిన్​పల్లి నుంచి వచ్చిన మల్లారెడ్డి ఇక్కడ పెత్తనం చలాయిస్తే నడవదన్నారు. తాగునీళ్లు, బస్సు సౌకర్యం కూడా కల్పించని మల్లారెడ్డికి ఎందుకు ఓటేయాలని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.50 లక్షలతో ఇల్లు కట్టిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాంత బిడ్డగా ఓటు అడిగే హక్కు తనకు ఉందంటూ చేతులు జోడించి ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో కీసర మండల ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్, బీసీ సెల్,  మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.