కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బెదిరింపులు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా కొందరు అజ్ఞాత వ్యక్తులు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై మంత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కిషన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా  భద్రతా బలగాల సంఖ్యను పెంచారు.