కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి

కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి
  • అమెరికాలోని అలస్కాలో ఘటన

జెనీవా: అమెరికాలోని ఆగ్నేయ అలస్కాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. జునాయు క్యాపిటల్​సిటికీ దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో కొండప్రాంతానికి సమీపంలో రాంగేల్​అనే గ్రామం ఉన్నది. ఇక్కడ 2 వేల మంది జనాభా కలిగిన మత్స్యకారుల కమ్యూనిటీ నివాసం ఉంటోంది.

సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ వర్షం, గాలులతో కూడిన తుఫాన్ ​సంభవించింది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి.. ఒక బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు కూడా కనిపించకపోవడంతో రెస్క్యూ టీమ్ ​సెర్చ్ ​ఆపరేషన్​ చేపట్టింది.