ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నాంచారయ్య, వెంకన్న, శివగా గుర్తించారు. గుడ్లవల్లేరు నుంచి పెడన మండలం జింజెరు గ్రామానికి ఆటో కూలీలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు జింజెరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారు కూడా ఇదే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
టిప్పర్ను ఢీకొట్టిన ఆటో .. ముగ్గురు మృతి
- ఆంధ్రప్రదేశ్
- March 28, 2021
లేటెస్ట్
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి
- సైకాలజీ : ఒక్కసారి ఓడిపోతే పోయేదేం లేదు.. విజయానికి అదే స్ఫూర్తి
- Summer Tour : చరిత్రకు సాక్ష్యం.. ఈ రాచకొండ గుట్టలు.. వెళ్లి చూసొద్దామా..!
- హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుపై పోలీసులకు ఫిర్యాదు
- రైతుల ద్రోహి కేసీఆర్ : గడ్డం వంశీ కృష్ణ
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Sai Durga Tej: గాంజా ఇక లేనట్టే.. లైన్లోకి హనుమాన్ నిర్మాత
- ఇద్దరి పేర్లతో పెద్దపల్లి బీఫామ్ ఇచ్చిన బీజేపీ
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- రాజస్థాన్లో కూలిపోయిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం