టిప్పర్‌ను ఢీకొట్టిన ఆటో .. ముగ్గురు మృతి

టిప్పర్‌ను ఢీకొట్టిన ఆటో .. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు దగ్గర ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న టిప్పర్‌ను వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నాంచారయ్య, వెంకన్న, శివగా గుర్తించారు. గుడ్లవల్లేరు నుంచి పెడన మండలం జింజెరు గ్రామానికి ఆటో కూలీలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు జింజెరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారు కూడా ఇదే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.