ముగ్గురు ఐపీఎస్‌‌లకు డీజీలుగా ప్రమోషన్

ముగ్గురు ఐపీఎస్‌‌లకు డీజీలుగా ప్రమోషన్
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ 

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో ముగ్గురు సీనియర్‌‌  ఐపీఎస్  అధికారులకు డైరెక్టర్‌‌  జనరల్‌‌  ఆఫ్‌‌  పోలీస్‌‌ (డీజీపీ) లుగా పదోన్నతి లభించింది.1991 బ్యాచ్‌‌కు చెందిన ఐపీఎస్‌‌లు రాజీవ్‌‌ రతన్‌‌, సీవీ ఆనంద్‌‌తో పాటు 1992 బ్యాచ్ కు చెందిన  జితేందర్‌‌ను డీజీపీలుగా ప్రమోట్  చేస్తూ సీఎస్‌‌  శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

రాజీవ్‌‌  రతన్‌‌  ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌‌ పోలీస్‌‌  హౌసింగ్‌‌  కార్పొరేషన్‌‌  చైర్మన్‌‌గా ఉండగా సీవీ ఆనంద్‌‌  హైదరాబాద్‌‌  సిటీ పోలీస్‌‌  కమిషనర్‌‌గా, టీఎస్‌‌  నార్కోటిక్స్‌‌  బ్యూరో  అడిషనల్‌‌ డైరెక్టర్‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక జితేందర్‌‌  హోం శాఖ చీఫ్  సెక్రటరీగా, జైళ్ల శాఖ డీజీగా పూర్తి స్థాయిలో అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ముగ్గురు అధికారులు డీజీ హోదాలో వారి స్థానాల్లో కొనసాగుతారని సీఎస్‌‌  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.