పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: మంత్రి తుమ్మల

పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: మంత్రి తుమ్మల

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాలతో తడి సిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. బుధవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటామని చెప్పారు. పంట నష్ట పరిహారాన్ని త్వరలో అందజేస్తామని తెలిపారు.