టిక్టాక్ మరో ప్రాణం తీసింది
చెరువులో ఈత కొడుతూ
మునిగిపోయిన యువకుడు
హైదరాబాద్ (పహాడిషరీఫ్), వెలుగు: టిక్టాక్ వీడియో కోసం చెరువులో ఈత కొడుతూ అందులో మునిగి చనిపోయాడో యువకుడు. పహాడిషరీఫ్ పోలీసుల కథనం ప్రకారం.. ధూల్పేట్గంగబౌళికి చెందిన పూజారి గీతాభాయి, ధన్రాజ్ సింగ్లు దంపతులు. వీరి కొడుకు పవన్సింగ్(22) కారు డ్రైవర్. ఇతడు ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్పూజారి రాజ్కుమార్, గుప్తా మహేష్ కుమార్, సాయిబాబాలతో కలిసి జల్పల్లిలోని ఉండాసాగర్ చెరువుకు వెళ్లాడు.
చెరువులో ఈత కొడుతూ టిక్టాక్ వీడియో చేయాలని అనుకున్నారు. పవన్తో పాటు మరో ఇద్దరు చెరువులో దిగగా, ఇంకో వ్యక్తి వీడియో తీశాడు.పవన్ ఈత కొడుతూ చాలా దూరం వెళ్లాడు. అలసిపోవడంతో తిరిగి రాలేక ‘కాపాడండి’ అంటూ కేకలు పెట్టాడు. దగ్గరికి వెళ్లే లోపే మునిగిపోయాడు. పోలీసులు డెడ్బాడీని చెరువు నుంచి వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.