హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ

హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లికి నిరసన సెగ

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిరసన సెగ తగిలింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించిన మంత్రిని గ్రామస్థులు అడ్డుకున్నారు. తిమ్మాపూర్  రోడ్డు  అధ్వానంగా మారిందని.. అధికారులకు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ మంత్రి ఎదుట ఆందోళన చెపట్టారు. త్వరగా రోడ్డు బాగుచేయాలని మంత్రికి గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. కాసేపు గ్రామస్థులతో ముచ్చటించిన మంత్రి  దయాకర్ రావు.. గ్రామంలో కావాల్సిన అవసరాలేంటో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. అందరూ యూనిట్ గా ఉంటారా అంటూ గ్రామస్థులను ప్రశ్నించిన మంత్రి ... కమ్మ వాళ్ళు మాట ఇస్తే తప్పరని అన్నారు. అటు రోడ్డు పనులను త్వరలోనే ఫ్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, అధికారులున్నారు.